ఈనెల 23, 24 తేదీలలో క్రిష్ణా జిల్లాలోని ప్రముఖ నాట్య కేంద్రం కూచిపూడిలో ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏ ఐ ఎన్ ఈ ఎఫ్ ) సెంట్రల్ వర్కింగ్ కమిటీ (సి డబ్ల్యూ సి ) సమావేశాలు ఎస్ ఎస్ ఎల్ కన్వెన్షన్ హలులో జరుగుతాయని, ఈరోజు సమావేశాలకు ఏపిజేయు ఆతిద్యం ఇస్తున్నామని ఏపిజేయు అధ్యక్షులు జాలే వాసుదేవనాయుడు, గౌరవ అధ్యక్షులు డా. కంచర్ల అచ్యుతరావు, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ కార్యదర్శి చలాది పూర్ణచంద్ర రావు లు నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. కూచిపూడి నాట్యానికి జన్మస్థలమని ఆ ప్రదేశాన్ని జాతీయ స్థాయిలో హాజరయ్యే జర్నలిస్ట్ నాయకులకు చూపించాలనే ధ్యేయం, తెలుగువారిగా కర్తవ్యం అన్నారు. రెండురోజులపాటు జరిగే ఈరోజు సమావేశాల్లో దేశంలోనూ, ఆయా రాష్ట్రాలలోనూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, నూతన వేతన సంఘం నియామకం, రిటైర్డ్ జర్నలిష్టు లకు జాతీయ పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చెయ్యాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానించటంతో పాటు ఇంకా జాతీయ ఫెడరేషన్ కి సంబంధించి వివిధ అంశాలపై సి డబ్ల్యూ సి సభ్యులు మాత్రమే పాల్గొనే సమావేశంలో చర్చించనున్నామని వారు తెలిపారు. 23వ తేదీ ఉదయం తోలుత శ్రీ సిద్దేంద్ర కళాక్షేత్రం నాట్యం విధ్యార్థులు కూచిపూడి నాట్య ప్రదర్శన అనంతరం జరిగే ప్రారంభసభలో పలువురు ప్రముఖులు, యూనియన్ జాతీయ నాయకులు పాల్గొంటారని వివరించారు. సభానంతరం భోజన విరామం అనంతరం నుండి కేవలం సి డబ్ల్యూ సి సభ్యులు మాత్రమే చర్చలో పాల్గొంటారని వాసుదేవ నాయుడు, డా.అచ్యుతరావు, పూర్ణచంద్రరావులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
