ఆధ్యాత్మికం

బాలత్రిపురసుందరి అమ్మవారికి వైశాఖ పౌర్ణమి ప్రత్యేక పూజలు

మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో కోరినకొర్కెలు నెరవేర్చే తల్లి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి వైశాఖ మాసం పౌర్ణమి సందర్భంగా సోమవారం తెల్లవారుజామున శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి పంచామృతాలతో వివిధ పళ్ళరసాలతో అభిషేకం సహస్ర నామ కుంకుమార్చనలు జరిగాయి. అనంతరం మహిళా బక్తులు లలితాపారాయణ గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతీ పౌర్ణమికీ విశేష అలంకారములతో […]

ఆధ్యాత్మికం

తణుకులో ఘనంగా తాళ్ళపాక అన్నమాచార్యులు జయంతి

ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు జయంతి సందర్భంగా వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టిడిపి నాయకురాలు వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో తణుకు రాష్ట్రపతి రోడ్డున వున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న అన్నమాచార్యల విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య అని 35 వేల కీర్తనలు రచించి పాడిన గొప్ప కీర్తనాచార్యులని, గొప్ప సంఘసంస్కర్త, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరునిపై పాడిన‌ పాటల ద్వారా ఆయనను

ఆధ్యాత్మికం

కొండాలమ్మ – పల్లాలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న రేణుక దంపతులు

వైశాఖ బుద్ధపౌర్ణమి పర్వదినమున తణుకు పట్టణం (పాతూరు) ఇలవేల్పు శ్రీ కొండాలమ్మ , పల్లాలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవ సందర్భముగా డా.ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ (హరిబాబు) అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు, నూతన వస్త్రములు సమర్పించి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి, పహల్గమ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని, పాక్ ముష్కరులను మట్టుపెట్టే శక్తి, మనోధైర్యం భారత సైనికులకు ప్రసాదించాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కొండాలమ్మ ,

ఆధ్యాత్మికం

అయ్యప్ప స్వామి వారికి వైభవంగా అన్నాభిషేకం

పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భారత త్రివిధ దళాలకు స్వామివారి అనుగ్రహం ఉండాలని ఆకాంక్ష తణుకులోని అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి గురువారం విశేష అన్నాభిషేకం వైభవంగా జరిగింది. భారత్ – పాక్ మధ్య యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తణుకు జాతీయ రహదారి అనుకుని వేంచేసిన అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్

ఆధ్యాత్మికం

ఇండియన్ ఆర్మీ చేస్తున్న కృషి అభినందనీయం

ఇండియన్ ఆర్మీకు వాసవి మాత ఆశీస్సులు ఉండాలి వాసవి మాత జయంతి ఉత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఇండియన్ ఆర్మీకు వాసవి మాత కటాక్షం ఉండాలని కోరారు. వాసవి మాత జన్మదినం పురస్కరించుకుని తణుకులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని బుధవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి

ఆధ్యాత్మికం

దేవాదాయశాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం

డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టుల ఖాళీలు మరో 200 వైదిక సిబ్బంది కొలువుల నియామకాలకు అంగీకారం కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు 23 ప్రధాన ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కార్యక్రమాలు చేపట్టాలి దేవాలయ భూముల్లో శాఖాహార హోటళ్లకు మాత్రమే అనుమతి దేవాదాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో

ఆధ్యాత్మికం

శ్రీ బాలత్రిపురసుందరి అమ్మవారికి చైత్ర పౌర్ణమి ప్రత్యేకపూజలు

మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో వేంచేసియున్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారికి ఈరోజు చైత్ర పౌర్ణమి సందర్భంగా బాలాత్రిపురసుందరి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, సహస్ర నామ కుంకుమ అర్చనలు జరిగినట్లు అర్చకులు మద్దిరాల వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పౌర్ణమికి శ్రీ బాలాత్రిపురసుందరీ అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తామని, అదేవిదంగా లలితా సహస్ర పారాయణ జరుగుతుందని తెలిపారు., అనంతరం అమ్మవారిని భక్తులు దర్శించుకుని

ఆధ్యాత్మికం

మార్చి 15న వెంకటపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణోత్సవము

మార్చి 15వ తేదీన వెంకటపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరగనున్న శ్రీవారి కల్యాణోత్సవ ఏర్పాట్లను సహచర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, నారాయణ , టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుతో టీటీడీ, పోలీసు అధికారులతో కలిసి భద్రత ఏర్పాట్లపై సమీక్షించడం జరిగింది..

ఆధ్యాత్మికం

శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి అన్నసమారాధన – ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డా.కంచర్ల

అన్నం పరబ్రహ్మ స్వరూమని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్, ప్రముఖ సీనీ నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖలోని శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో ఆయన గురువారం ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన అన్నసమారాధన కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాస్ పట్నాయక్, టీడీపీ నాయకులు కాళ్ల శంకర్ లతో కలిగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన శివరాత్రి రోజున ఈ ప్రాంత వాసులకు

ఆధ్యాత్మికం

ఉండ్రాజవరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం

తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో కొలువైన స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాఘమాసం మంగళవారం షష్టి తిధి సందర్భముగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అనంతరం విశేష అలంకరణ జరిగింది. ఈ సందర్భంగా భారీగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Scroll to Top