ఆధ్యాత్మికం

నిడదవోలు కోటసత్తెమ్మను దర్శించుకున్న పోలీస్ ఉన్నతాధికారులు

తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్న ఏలూరు రేంజ్ ఐ.జి. అశోక్ కుమార్, ఆయనతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్, అడిషనల్ ఎస్పీ ఎన్ .వి.మురళీకృష్ణ, కొవ్వూరు డి.ఎస్.పి దేవకుమార్, నిడదవోలు సీఐ తిలక్, ఎస్సైలు శోభనకుమార్, జీ. సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన సిబ్బంది పొలీస్ అధికారులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.

ఆధ్యాత్మికం

తిరుచానూరులో గరుడ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో రాత్రి 7 గంటలకు అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. గరుడసేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా

ఆధ్యాత్మికం

కార్తీక పౌర్ణమి రొజున పూర్తైన ఆప్త వాజపేయ మహాయాగం

నవంబర్ 1 నుండి 15వ తేదివరకు జరుపబడిన ఆప్తవాజపేయం మహాయాగం ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో చివరి రోజు కార్తీకమాసం పౌర్ణమి సందర్భంగా భక్తులు వేలాదిగాతరలివచ్చారు. కోటి దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం, యాగశాల, స్వామి అమ్మవార్లను దర్సించుకుని, కొటికుంకుమార్చన జరిపిన కుంకుమను మహిళాభక్తులు స్వీకరించారు. అనంతరం భక్తులు ప్రాంగణంలో జరుపబడిన అఖండ అన్న సమారాధనలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

Scroll to Top