నర్సాపురం పార్లమెంట్ అభివృద్దే కూటమి ప్రభుత్వ ధ్యేయం – కేంద్రమంత్రి బీజేపీ వర్మ

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నరసాపురం పార్లమెంట్ బిజెపి కార్యాలయంలో శుక్రవారం విలేకరుల ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి వర్మ మాట్లాడుతూ పథకంలో భాగంగా రాష్ట్రంలో 5 ప్రదేశాలలో భీమవరం ఒకటి కావడానికి కేంద్ర ఆరోగ్యశాఖమంత్రికి నా వంతు కృషి నేను చేశానని రెండోసారి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కూడా కలిసి ఈ విషయం గురించి అడగడం జరిగిందని భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ కి 23.75 లక్షలు మంజూరు కావడం శుభ పరిణామం అని, దీనివల్ల భీమవరం చుట్టుపక్కల ఉన్న ప్రజలకు వైద్యం మరింత చేరువతుందని, అదేవిధంగా భీమవరం బైపాస్ ప్రాజెక్టులకు సంబంధించి నేషనల్ హైవేస్ అధికారులతో ఎన్ హెచ్ 165 పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు వేగవంతమైన సురక్షితమైన రోడ్డు కనెక్టివిటీని అందిస్తుందన్నారు. అనేక ప్రధాన పట్టణాలు అనేక గ్రామాలను కలుపుతుందన్నారు. ఎన్ హెచ్ 165 (అకివీడు నుండి దిగమర్రు వరకు), భీమవరం బైపాస్ ప్రాజెక్టులకు సంబంధించి నేషనల్ హైవేస్ అధికారులతో మాట్లాడానని తెలిపారు.

Scroll to Top
Share via
Copy link