క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే డివిజన్ మండలస్థాయి అధికారులకు మీ అర్జీలు పరిష్కారం కోసం అందజేయండి – జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎన్నికల కోడ్ ఎత్తివేయడం జరిగినా దృష్ట్యా గతంలో నిర్వహించే విధానంలో ఇకపై ప్రతి సోమవారం పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియచేశారు.

ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యయ ప్రయాసలు కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే డివిజన్ మండలస్థాయి అధికారులకు మీ అర్జీలు పరిష్కారం కోసం అందజేయాలన్నారు.

రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.

రెవెన్యూ, మునిసిపల్, మండల స్థాయి లో అర్జీలను క్షేత్ర స్థాయిలోని కార్యాలయాల్లో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక లో అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు. మండల స్థాయి అధికారులు అందరూ మండల ప్రధాన కేంద్రంలో ఒకే చోట హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలన్నారు.

Scroll to Top
Share via
Copy link