
సాక్షి టివి డిబేట్ లో అమరావతి మహిళా రైతులపై కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు విచక్షణ కోల్పోయి మాట్లాడిన మాటలకు తెలుగుదేశం పార్టీ నాయకురాలు వావిలాల సరళాదేవి ఖండిస్తూ అమరావతి మహిళా రైతులను వేశ్యలు అని మాట్లాడటం ఎంత వరకు సమంజసం, ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా బుద్ధిరాని మీకు సీటు అనేది లేకుండా ప్రజలు మిమ్మల్ని మూలన కూర్చో పెట్టేరోజు ముందు ముందు వుంది అని, అన్నపూర్ణతో సమానమైన మహిళా రైతులపై మీ పదజాలానీకి బదులుగా మీ ఇంటి మహిళలతో మంచిగా కనీసం మీ అమ్మను అమ్మా అనే అర్హతను కోల్పోయినారని, మీరు చంద్రబాబునాయుడు భువనేశ్వరి తల్లి పాదాలను కడిగాలని, అదే విధంగా రైతులకు క్షమాపణలు చెప్పాలని లేకుంటే దేశంలో ఎక్కడ వున్నా తెలుగు మహిళలతో తన్నులు తినటం ఖాయం అని హెచ్చరించారు.