పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నాడు రేలంగి గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. సిపిఎం పార్టీ మండల పార్టీ కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని దీని వెంటనే ప్రభుత్వం అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇసుక లేక బిల్డింగు కార్మికులు పనులు లేక పస్తులతో కాలం గడుపుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలపై ఎటువంటి ఆర్థిక భారాలు పెంచమని వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారాలు పెంచుతూ ప్రజలను ఆర్థికంగా ఇబ్బంది పాలు చేస్తున్నారని మునుస్వామి అన్నారు. ఇప్పటికే కరెంటు ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో 8,142 కోట్ల రూపాయలు అదనంగా పెంచాలని ఆలోచనతో ప్రభుత్వం ఉన్నదని, వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రోడ్లు నిర్మాణాలు జరక్క ట్రాన్స్పోర్ట్ రంగం కుదేలు అయిపోయిందని అన్నారు. ప్రభుత్వము వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని కేరళ రాష్ట్రం ప్రజలకు చౌక దుకాణాలు ద్వారా 16 రకాలైన నిత్యాస్తరా వస్తువులను సప్లై చేస్తున్నారని అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా సరుకులను రేషన్ షాపుల ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో ప్రజాసమస్యలు పరిష్కారం కానిపక్షంలో సిపిఎం పార్టీ ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని మునుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మాజీ మండల కార్యదర్శి ఇల్లందు పెద్ద సత్యనారాయణ, తొంట నాగబాబు, పి. సత్యనారాయణ, జన్ని మహాలక్ష్మి, జోగి సాయి తదితరులు పాల్గొన్నారు.
