మళ్లీ 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. అక్టోబర్ 2 తర్వాత రాష్ట్రమంతటా ఆకస్మిక తనిఖీలు చేస్తాను. మీ ఊరికి వచ్చే విషయం కేవలం రెండు, మూడు గంటల ముందే తెలుస్తుంది. ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుంది. సమైక్యాంధ్రలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా నేను ప్రారంభించాను. . ప్రధాని మోదీ ఆదేశాల ప్రకారం స్వచ్ఛ భారత్ నివేదిక ఇచ్చాను. నా ఆశయం ఒకటే స్వచ్ఛమైన ఏపీ తయారుచేయాలి. స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర మా లక్ష్యం. విశాఖ ,గుంటూరులో 30 మెగావాట్ల రెండు వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు నెల్లూరు, రాజమండ్రిలో రూ.700 కోట్లతో 22 మెగావాట్ల విద్యుత్ తయారుచేసే ప్లాంట్లు పెడుతున్నాం. రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రోడ్లపై ఉంది. అందులో 51 లక్షల చెత్త తొలగింపు పూర్తయింది. అక్టోబర్ 2 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేసేందుకు మంత్రి నారాయణ పనిచేస్తున్నారు. 2027 నాటికి 100 శాతం మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి వాడుతాం. ఒకప్పుడు మరుగుదొడ్లు ఉండేవి కాదు. మహిళల ఆత్మ గౌరవం పేరుతో కొత్తవి నిర్మించాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 లక్షల 60 వేల మరుగుదొడ్లు మంజూరు చేశాం. అందులో 72 వేల మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పట్టణాలు, మండల హెడ్ క్వార్టర్స్ లో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మిస్తాం.
ఇండికేటర్స్ ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు
స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి విభాగానికి పెర్మామెన్స్ ఇండికేటర్ ర్యాంకింగ్స్ తయారుచేశాం. మున్సిపల్ శాఖకు 20 పాయింట్లు , పంచాయతీ రాజ్ కు 28 పాయింట్లు, ఎడ్యుకేషన్ కు 14 పాయింట్లు, టూరిజంకు 11 పాయింట్లు, ఇండస్ట్రీస్కు 13 పాయింట్లు, హాస్టల్స్ కు 11 పాయింట్లు , ఎండోమెంట్ కు 11 పాయింట్లు , ఆస్పత్రులకు 9 పాయింట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కు 5 పాయింట్లు, బస్టాండ్లు, ర్వైల్వే స్టేషన్లకు 7 పాయింట్లు, మార్కెట్స్ కు 9 పాయింట్లు, హైవేస్ కు 3 పాయింట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 7 పాయింట్లు చొప్పున ఇచ్చాం. మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ లో జిల్లాల ప్రోగ్రస్ గమనిస్తే…. ఎన్టీఆర్ జిల్లా 134 పాయింట్లు, అనాకపల్లి జిల్లా 131 పాయింట్లు , తిరుపతి 128 పాయింట్లు, విశాఖ 127 పాయింట్లు, అనంతపురం 123 పాయింట్లు, కాకినాడ 121 పాయింట్లు, గుంటూరు 119 పాయింట్లు, ఈస్ట్ గోదావరి 118 పాయింట్లు, పల్నాడు 117 పాయింట్లు, అన్నమయ్య 115 పాయింట్లు, అంబేద్కర్ కోనసీమ 115 పాయింట్లు, శ్రీకాకుళం 113 పాయింట్లు, వైఎస్సాఆర్ 113 పాయింట్లు, బాపట్ల 111 పాయింట్లు, ఏలూరు 108 పాయింట్లు, కర్నూలు 104 పాయింట్లు, నంద్యాల 102 పాయింట్లు, సత్యసాయి 102 పాయింట్లు, పార్వతీపురం 100 పాయింట్లు, పొట్టి శ్రీరాములు 100 పాయింట్లు, విజయనగరం 100 పాయింట్లు, కృష్ణా 99 పాయింట్లు, ప్రకాశం 99 పాయింట్లు, వెస్ట్ గోదావరి 97 పాయింట్లు , చిత్తూరు 91 పాయింట్లు, అల్లూరు సీతారామరాజు 68 పాయింట్లు వచ్చాయి. ఐవీఆర్ ఎస్ ద్వారా అందరి పనితనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. జపాన్ వంటి దేశాల్లో రోడ్డుపై చెత్త వేయరు. మనకూ అలాంటి అలవాట్లు రావాలి. మున్సిపల్ శాఖలో వివిధ పనుల నిమిత్తం…పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా రూ. 150 కోట్లు గ్రాంట్ గా అందబోతున్నాయి.
తణుకులో పలు అభివృద్ధి కార్యక్రమాలు
తణుకు ఎమ్యెల్యే రాధాకృష్ణ డైనమిక్ లీడర్. తణుకులో పలు అభివృద్ధి పనులకు నిధులు కావాలని అడిగారు. తప్పకుండా మంజూరు చేస్తాం. ఇక తణుకు అనగానే ప్రముళఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ గారిని మనం గుర్తుచేసుకోవాలి. ఆయన తణుకు మున్సిపాలిటీకి ఎన్నో సేవలు చేశారు. ఈ నియోజకవర్గ ప్రజలు టీడీపీకి ఎక్కువ సార్లు పట్టం కట్టారు. అయితే….తణుకు అనగానే టీడీఆర్ బ్రాండ్లు గుర్తొస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. అంతకుముందు తణుకు కూరగాయల హోల్ సేల్ మార్కెట్ ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వ్యాపారం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్కులో చెత్తను ఊడ్చారు.. స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.