ఈ సందర్భంగా ఆరుగొలను గ్రామ మాజీ ఉపసర్పంచ్ చిరంజీవి మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్వారీ లారీ ఓనర్స్ యూనియన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని..గతంలో లారీ ఓనర్స్ తో ఒక తిమింగలం గ్రావెల్ తోలించుకుని బిల్లులు చేయించుకున్న సందర్భం ఉంది.
కానీ బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే మాత్రం.. మీ గ్రామ సొమ్ము నాకెందుకు.. మీ డబ్బుతో మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి.. మీరందరూ ఒక కమిటీ వేసుకుని ఐకమత్యంగా ఉండి ఖర్చు పెట్టుకోండి.. నాకు ఏ విధంగానూ, ఏ విషయంలోనూ ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోను.. నాకు అవసరం లేదు.. మీ డబ్బుతో మీ గ్రామం అభివృద్ధి చేసుకోండి అని అన్నారని.. అదేవిధంగా ఎస్సీలకు 5 లక్షలు , బీసీలకు 2లక్షలు, కాపు స్మశాన వాటికి కూడా బిల్లు పెట్టడం జరిగిందని..
అదేవిధంగా గ్రామంలో కాపు స్మశానం ఎంతో సుందర వనంగా ఉందని.. ఇంకా మనకు నాలుగు సంవత్సరాలు గడువుంది కాబట్టి మనమంతా ఐకమత్యంగా ఉండి గ్రామ అభివృద్ధి చేద్దామని.. అదేవిధంగా ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం ఎంతో అదృష్టమని నియోజకవర్గ బ్రాందీ షాపుల్లో గాని, ఎక్కడ కూడా కమిషన్ తీసుకోకుండా యదార్ధంగా ఉంటున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపిన ఆరుగొలను మాజీ ఉపసర్పంచ్ చిక్కాల చిరంజీవి.
ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం రూరల్ మండలం అధ్యక్షుడు అడపా ప్రసాద్, పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబి, పీతల బుచ్చిబాబు, పొట్టూరి రాంబాబు, ఉప్పలపాటి సత్యనారాయణ, మద్దాల మణికుమార్, పైబోయిన వెంకటరామయ్య, మట్ట రామకృష్ణ, సందక రమణ, ఆరుగొలను జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు