పెరవలి మండలం అజ్జరం గ్రామంలో సోమవారం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా 100 డేస్ టీబి క్యాంపైనింగ్ కార్యక్రమం ఎంపీపీ కార్చెర్ల సీతారాం ప్రసాద్ చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది, క్షయ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు, అనంతరం టీబీ ట్రీట్మెంట్ పొందుతున్న వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కిట్స్ అందజేశారు,
పెరవలి ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ఇ. తేజశ్రీ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు రాత్రిపూట జ్వరం బరువు తగ్గటం వంటి లక్షణాలు ఉంటే క్షయ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తక్షణమే గ్రామంలో వైద్య సిబ్బందిని సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా తెలిపారు క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు మందులు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలియజేశారు. టిబి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో ఈ క్యాంపును నిర్వహించినట్లు తెలిపారు 150 మందికి టిబి స్క్రీనింగ్ చేసి అవసరమైన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాము అని తెలియజేశారు, ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు ప్రైవేట్ ఆస్పత్రిలో క్షయ వ్యాధి నివారణ మందులు వాడుతున్న వ్యాధిగ్రస్తులకు నెలకు డి బి టి ద్వారా 1000/- మందులు వాడుతున్నంత కాలం ప్రభుత్వము అందజేస్తుందని తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించడానికి దాతలు ముందుకు రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎం పీ హెచ్ ఎస్ రాజేష్, సిహెచ్ఓ శివ, 104 సిబ్బంది మనోజ్, ఆశ కార్యకర్తలు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
