ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ జవహర్‌కు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు

ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. సోమవారం విజయవాడలో ఎస్సీ కమిషన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన పుష్ఫగుచ్ఛం, శాలువాతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు.

Scroll to Top
Share via
Copy link