రూ. 11.55 లక్షలు అందజేసిన కూటమి నేతలు
ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదేశాలతో చెక్కులు పంపిణీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో రాష్ట్రంలోనే తణుకు నియోజకవర్గం ముందంజలో ఉందని తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలోని 11 మందికి సోమవారం రూ. 11.55 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూటమి నాయకులు అందజేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలు మేరకు స్థానిక కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈమేరకు చెక్కులను అందజేసి మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అర్హత ఉండి వైద్యం చేయించుకోలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, ఏఎంసీ మాజీ ఛైర్మన్ బసవా రామకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బిజెపి టౌన్ అధ్యక్షులు నాగరాజు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.