తణుకు నియోజకవర్గంలో అత్తిలి మండలం అత్తిలి ఎస్ వి ఎస్ ఎస్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణమునందు, ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో జడ్పీ హైస్కూల్ ప్రాంగణము మరియు తణుకు పట్టణంలో బాయ్స్ హైస్కూల్ ప్రాంగణమునందు సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.
మన గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటే మూడు రోజులపాటు ఇంటిల్లిపాది మరియు బంధుమిత్రులతో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఈ భోగి,సంక్రాంతి, కనుమ అని అన్నారు. రాష్ట్రంలో ఉండేవారే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న మన బంధుమిత్రులందరూ కూడా యొక్క సంక్రాంతి పండుగకు వచ్చి పండుగ యొక్క ప్రత్యేకతను చాటుకుంటారని అన్నారు.ఇటువంటి సంక్రాంతి సంబరాలు మన నియోజకవర్గంలో సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందకరమని అన్నారు. రైతులకు అన్నివర్గాల ప్రజలకు కూడా ప్రత్యేక స్థానాన్ని ఇచ్చేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ అని అన్నారు. ఈ పండుగలు పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సంక్రాంతి శోభ ప్రతి కుటుంబాల్లో కూడా ఉండాలని అన్నారు.గత ఐదు సంవత్సరాలుగా చూసాము కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పడిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉన్నదని మనందరికీ తెలిసిందే అని అన్నారు,కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారని, ప్రతి ఒక్కరు కూడా వారికి స్వతంత్రం వచ్చిందని ఆనందంగా ఏడు నెలల పరిపాలనలో భాగంగా ఒక సుపరిపాలన అందిస్తూ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే దేయంగా ఈరోజు పరిశ్రమలు పెట్టుబడులు మన రాష్ట్రానికి ప్రవాహంగా వస్తున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి సమర్థమైన న్యాయకత్వం అని అన్నారు. మోడీ సహకారంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , ప్రజల సంక్షేమం కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ ఎటువంటి గొప్పలకు వెళ్లకుండా ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు వెళ్ళుచున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎలా అమలుపరుస్తున్నామో మనం అందరం చూస్తున్నామని అన్నారు.పెన్షన్ గతంలో కంటే ఈరోజు 4000 రూపాయలు పెంచడం జరిగిందని అన్నారు అదేవిధంగా దీపం పథకం ద్వారా పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుందన్నారు. గ్రామాలలో అభివృద్ధిలో రోడ్లు గాని డ్రైనేజీలు గాని నిర్మించే విధముగా ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తుందని అన్నారు. రాబోయే నాలుగున్నర సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాలలో సంపూర్ణంగా ఇంటింటికి నీరు అందించే పథకం ఏర్పాటు చేస్తుందని, ప్రతి ఇంటికి మంచినీరు కుళాయిలు ఏర్పరిచి వారికి మంచినీరు అందించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. రైతాంగం గాని వనరులు గాని యువత గాని విద్యార్థులు గానీ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పనిచేసే విధంగా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టువంటి విద్యార్థి విద్యార్థులకు అదేవిధంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు చేసినటువంటి వారి అందరికీ కూడా పేరుపేరునా అభినందనలు తెలియజేసుకుంటున్నానని ఈ సందర్భంగా మాట్లాడినారు, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.