జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం ఉండ్రాజవరం హైస్కూల్ యందు ఉండ్రాజవరం మండలం పోలీస్ స్టేషన్లో బూత్ లెవెల్ అధికారులు ఆధ్వర్యంలో మండలంలో గల సీనియర్ సిటిజన్ ఓటర్లు లను సన్మానించి ఓటు యొక్క విలువను, ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి, అవగాహన సదస్సును, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల తహసిల్దార్ పి.యన్.డి. ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారానే సమర్థవంతమైన పరిపాలన పొందగలరని, రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా తన హక్కులను పొందవచ్చని అన్నారు. ఈ సందర్భంగా మండలంలో సీనియర్ సిటిజన్ ఓటర్లు కుంచె కృష్ణమూర్తి (92) కొమ్ము మార్తమ్మ (96) లను సన్మానించారు. విద్యార్థులకు నిర్వహించిన జాతీయ ఓటర్ దినోత్సవం పై డిబేట్ కాంపిటీషన్స్ లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అదేవిధంగా బూత్ లెవెల్ అధికారులలో ఎలక్షన్ వర్క్ యందు ప్రావీణ్యం చూపించిన ఉద్యోగులకు బెస్ట్ బిఎల్ఓ అవార్డులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ఏ కనకదుర్గ, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మాణిక్యాలరావు, మండల వీఆర్వోలు వెలిచేటి పాపారావు, బద్దా శ్రీనివాసు, సచివాలయ ఉద్యోగులు బొంతు తేజేంద్ర, దిద్దే నాగ శిరీష, కే.రాజేష్, ధన తేజ, టీ.ఎల్.ఎన్.డి.శిరీష, శ్రీనివాస్, షర్మిల, స్కూల్ విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
