పోడూరు : భారత అణుశక్తి పితామహుడు, పద్మభూషణ్ హోమీ జహంగీర్ బాబా వర్ధంతి సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చింతలగరువులో శుక్రవారం ఉపాధ్యాయుడు, న్యూమిస్మాటిస్ట్ కొల్లాబత్తుల సూర్య కుమార్ వద్దగల ‘భారత అణుశక్తి పితామహుడు’ హెచ్.జే.బాబా స్మారకాలను ప్రదర్శించారు.1909 అక్టోబరు 30న బొంబాయిలో జన్మించిన బాబా భారతీయ కేంద్ర భౌతిక శాస్త్రవేత్త వ్యవస్థాపక డైరెక్టరు గాను, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీఛార్జ్ లో భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా పనిచేశారని కాస్మిక్ కిరణాల జల్లులకు సంబంధించిన ‘జలపాత సిద్ధాంతం’ ఈయన ఆవిష్కరణేనని, బొంబాయి సమీపంలో మొదటి అణు పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించారనీ,ఈయన గౌరవార్థం ‘బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్’అని పేరు పెట్టారు.ఈయనను ‘భారత అణుశక్తి పితామహుడు’ అని పిలుస్తారని, యురేనియం నిల్వల కంటే దేశంలోనే విస్తారంగా లభ్యమవుతున్న థోరియం నిల్వల నుండి శక్తిని వెలికి తీయడంపై దృష్టి సారించే వ్యూహాన్ని రూపొందించిన ఘనత ఈయనకు ఉంది. ఈ థోరియం కేంద్రీకృత వ్యూహం ప్రపంచంలోనే అన్ని దేశాలలో కంటే భిన్నంగా ఉంది. ఈ వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించడానికి బాబా ప్రతిపాదించిన విధానం భారతదేశం యొక్క మూడు దశల అణు విద్యుత్ కార్యక్రమంగా మారింది. 1996 జనవరి 24 వ తేదీన మౌంట్ బ్లాంక్ సమీపంలో కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ కూలిపోవడంతో బాబా మరణించారు. 1942లో ఆడమ్స్ ప్రైజ్,1954లో పద్మభూషణ్ పురస్కారంతో పాటు భారతదేశానికి, విదేశాలకు చెందిన అనేక విశ్వవిద్యాలయాల నుండి ‘గౌరవ డాక్టరేట్’ లను అందుకున్నారన్నారు. హోమీ జహంగీర్ బాబా శత జయంతి స్మారకంగా భారతదేశం 2009వ సంవత్సరంలో ఈయన ముఖ చిత్రం ముద్రించి విడుదల చేసిన 10 రూపాయల నాణెమును, 4రూపాయల విలువ గల పోస్టల్ స్టాంపుని సూర్య కుమార్ పాఠశాలలో ప్రదర్శించారు.
