ఉండ్రాజవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

ఉండ్రాజవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి, వైసీపీ నాయకులు పాలాటి శరత్ బాబు శాలువాకప్పి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు అందించవలసిన సేవలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి. రామకృష్ణంరాజు, పంచాయతీ విస్తరణ అధికారి జిడివి ప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ హరిప్రసాద్, వైస్. ఎంపీపీ సరోజ, దమ్మెన్ సర్పంచ్ గురజర్ల సత్యనారాయణ, తాడిపర్రు సర్పంచ్ కరటూరి నరేంద్రబాబు, ఎంపీటీసీలు కరుణాకర్, పసల బుల్లి సుబ్బారావు, వేముల వెంకట సత్యనారాయణ, గాడి క్రిస్టఫర్, గడ్డం రామకృష్ణ, ఇసుకపల్లి ప్రభావతి, భ్రమరాంబ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.,

Scroll to Top
Share via
Copy link