రావులపాలెం నడిరోడ్డులో ఆదివారం ఆరా బ్యాటరీ వాహనం దగ్ధమైంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలను తట్టుకోలేక వాహనదారులు బ్యాటరీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవికాలం అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక బ్యాటరీ వాహనాలు ఇటీవల కాలంలో చాలా చోట్ల దగ్ధమవుతున్న విషయం తెలిసిందే. పార్క్ చేసి ఉన్న బ్యాటరీ వాహనం ఒక్కసారిగా పొగలు చిమ్ముతూ మంటలు చెలరేగడంతో స్థానికులు కంగారుపడి పరుగులు తీశారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరుకు చెందిన సత్తి పెద్దిరెడ్డి కి చెందిన బ్యాటరీ బండి. ఆరా బండి నడిరోడ్డుపై తగలబడి పోవడంతో భయాబ్రాంతులకు గురైన ద్విచక్ర వాహనదారులు.
