విజయం సాధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులతో జనసేన ఎమ్మెల్యేల అభినందన సభ జరిగింది.
సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంతో పాటు ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్అసెంబ్లీ ప్రాంగణంలోని జనసేన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు ప్రభుత్వ విప్ , నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, జనసేన శాసనసభ్యులు లోకం మాధవి, సుందరపు విజయ్ కుమార్, పచ్చమట్ల ధర్మరాజు, వంశీకృష్ణ యాదవ్, అరవ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని పట్టభద్రులు మరొకసారి ఆశీర్వదించారని సభలో వక్తలు పేర్కొన్నారు