మార్చి 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్గా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస నియామకం అభినందనీయం పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి అన్నారు. వర్తనపల్లి కాశి ఆధ్వర్యంలో జరిగిన కార్యాచరణ సమావేశానికి ముఖ్యఅతిథిగా యువనాయకులు బొలిశెట్టి రాజేష్ హాజరయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ వద్ద జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేయాలని అందుకు తగ్గట్లుగా కొన్ని కమిటీలను ఏర్పాటు చేయవలసి ఉందని, వాటి కార్యాచరణపై నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న అగ్రశ్రేణి నాయకులు ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
