పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి
********
తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు వద్ద గ్రామదర్శిని, పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో అభివృద్ధిపై నిర్లక్ష్యం అయిందన్నారు, గ్రామదర్శిని- పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అని అన్నారు, నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తారన్నారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు, మినీ గోకులం నిర్మాణాలకు చర్యలు. సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మాణానికి రూ.7.50 కోట్లు, మినీ గోకులం రూ.1.50 కోట్లు కేటాయింపు జరిగిందన్నారు. ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసిన పనులు జనవరి లోపు పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కె.సముద్రపు గట్టు గ్రామంలో ఆదాయ వనరుగా ఉన్న చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు. గ్రామాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది, తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
