జిల్లా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం

తణుకులో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మంతెన రామరాజు*. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు కావాలి. గతంలో ఓటు వేసిన వారు సైతం మళ్లీ నమోదు కావాలన్నారు. నియోజవకర్గంలో కనీసం పది వేల మంది ఓటర్లు నమోదయ్యేలా చూడాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటర్లుగా నమోదు కావాలన్నారు. ప్రజల కోసం పని చేసే ప్రతినిధిని ఎన్నుకునేందుకు ప్రతి ముందుకు రావాలని అన్నారు. గ్రామాలు, వార్డుల్లో గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.నవంబర్‌ 6లోపు ఓటర్లుగా నమోదు చేసేందుకు టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ ఏదైనా బిల్లు పెట్టాలంటే శాసనసభ నుంచి శాసనమండలికి వెళుతుందని అక్కడ గవర్నర్‌ ఆమోదం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులు బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో టిడిపి నుంచి శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న షరీఫ్‌ బిల్లును తిరస్కరించారని అన్నారు. గత అయిదేళ్ల కాలంలో అప్రజాస్వామికంగా నియంతృత్వ ధోరణితో ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్లు వేయలేని దుస్థితిలో ఉన్నామన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ అధికారం చేపట్టవచ్చనే ఆత్మవిశ్వాసం కలిగిందన్నారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌ మంతెన రామరాజు మాట్లాడుతూ… రాష్ట్రంలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయిదు స్థానాల్లో మూడు స్థానాల్లో ఎన్నికలు జరిగాయని అన్నారు. టిడిపి అధికారంలో లేకపోయినప్పటీకీ మూడు స్థానాలు గెలుచుకున్నామని అన్నారు. గతంలో కంటే ఎక్కువగా ఈ సారి ఓటర్లు నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link