
ఉండ్రాజవరం మండల తాసిల్దార్ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తహసిల్దార్ పి. ఎన్. డి. ప్రసాద్ , వీఆర్వో వి.పాపారావు తదితరులు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని నిర్మించుకున్న భారతదేశ ప్రజలు, రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన మౌలిక హక్కులను, అంబేద్కర్ స్ఫూర్తితో కొనసాగించాలన్నారు.