కిషోరి బాలికల వికాస కార్యక్రమంలో భాగంగా మంగళవారం చివటం గ్రామపంచాయతీ కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చివటం గ్రామపరిధిలో గల అంగన్వాడీలు గ్రామంలో బాలబాలికలకు వేసవి సెలవులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో కిషోర బాలికలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి జీవీ వి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి బాలిక చదువు పట్ల శ్రద్ధ పెంచుకుని వేసవి సెలవులను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళ పోలీస్ జి. రాజేశ్వరి, అంగన్వాడీ వర్కర్లు బేబీ రాణి, సూర్యకుమారి, నిర్మల, కిషోర బాలికలు పాల్గొనడం జరిగింది.
