మనసు కవి ఆచార్య ఆత్రేయ జయంతిని సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో బుధవారం తణుకు శ్రీ అమృత హాస్పిటల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ విలంబి వెంకట నరసింహాచార్యులు అనే పేరులోని ఆచార్య గోత్రం లోని అమరయ్య వెరసి ఆచార్య ఆత్రేయగా పిలవబడినారని తన కవిత్వంతో మనసు కవి, మనసున్న కవిగా పేరు గడించారని అన్నారు. డాక్టర్ పల్లిపాటి దేవసహాయం మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారని కదోచిత పాత్రోచితమైన పాటలు మాటలు రాసి విశేష కీర్తిని ఆత్రేయ పొందారని అన్నారు. ఈ సందర్భంగా ఆచార్య ఆత్రేయ జీవిత చరిత్రపై నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ పల్లిపాటి దేవ సహాయం ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ సన్నమండ శ్రీను, గుప్తా వెంకటేశ్వరరావు, గాదిరెడ్డి వెంకటేశ్వరరావు, జి. ఫణీంద్రబాబు, కె. మణి, పి.శ్రీలేఖ, కే. ప్రవీణ్ కుమార్, ముక్కామల మోహనరావు, ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, అర్జీ భాస్కరరావు మహమ్మద్ షాలిషాన్ తదితరులు పాల్గొన్నారు.
