అయ్యప్ప స్వామి వారికి వైభవంగా అన్నాభిషేకం

పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

భారత త్రివిధ దళాలకు స్వామివారి అనుగ్రహం ఉండాలని ఆకాంక్ష

తణుకులోని అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి గురువారం విశేష అన్నాభిషేకం వైభవంగా జరిగింది. భారత్ – పాక్ మధ్య యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తణుకు జాతీయ రహదారి అనుకుని వేంచేసిన అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను దీటుగా ఎదుర్కొంటున్న భారత ఆర్మీకు ప్రతి ఒక్కరూ అండగా ఉంటూ వారి ధైర్యసహసాలను అభినందించాల్సి ఉంటుందని అన్నారు. స్వామివారి అనుగ్రహం భారత ఆర్మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link