వైశాఖ బుద్ధపౌర్ణమి పర్వదినమున తణుకు పట్టణం (పాతూరు) ఇలవేల్పు శ్రీ కొండాలమ్మ , పల్లాలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవ సందర్భముగా డా.ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ (హరిబాబు) అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు, నూతన వస్త్రములు సమర్పించి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి, పహల్గమ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని, పాక్ ముష్కరులను మట్టుపెట్టే శక్తి, మనోధైర్యం భారత సైనికులకు ప్రసాదించాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కొండాలమ్మ , పల్లాలమ్మ అమ్మవార్లను ప్రార్దించారు. ఈ సందర్భంగా ముళ్ళపూడి రేణుక, హరిచంద్ర ప్రసాద్ దంపతులను జాతర కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి అమ్మవారి ఫొటోను అందజేశారు.
