కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్య వల్లిక చిత్రం
విశాఖలో సందడి చేసిన సింగిల్ చిత్రం యూనిట్..
యంగ్ హీరో శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా #సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఈ నెల 9 న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం ఓ హోటల్లో సందడి చేసింది. ఈ సందర్భంగా వారు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా చిత్ర హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుటుంబ పరంగా సమేతంగా చూడదగ్గ చిత్రమని అదే విధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయని అన్నారు. అదేవిధంగా ఈ చిత్రానికి దర్శకుడుగా కార్తీక్ రాజు, నిర్మాతలుగా విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి వహించారన్నారు. ఈ చిత్రం కథ సింపుల్ గా ఉన్నా మంచి స్క్రీన్ ప్లే, అద్భుతమైన డైలాగ్స్ కుదరడంతో సింగిల్ మూవీ థియేటర్ లో నవ్వులు పూయించిందన్నారు. ఈ చిత్రంలోని కేతిక శర్మ, ఇవానా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య, కల్పలత తదితరులు వారికి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారని అన్నారు. అనంతరము నటుడు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి కామెడీ సన్నివేశాల్లో శ్రీవిష్ణు చాలా బాగా నటించాడని దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ చాలా ప్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టరన్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే లవ్ సన్నివేశాల్లో మంచి కామెడీని పండించారన్నారు. హీరోయిన్స్ గా నటించిన కేతిక, ఇవానా నటన ఆకట్టుకుంది. ఇవానా తన గ్లామర్ తో పాటు తన నటనతోనూ మెప్పించింది. చివర్లో రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ బాగుంది. హీరోయిన్స్ కేతికశర్మ, ఇవానా మాట్లాడుతూ విశాఖ అంటే మాకు ఎంత అభిమానం ఉందని ఈ సినిమాలో తొలిగా నటించిన మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. అదేవిధంగా ప్రధానపాత్రలో నటించిన వెన్నెల కిషోర్ కూడా అద్భుతమైన నటనతో చాలా బాగా నటించారు. ప్రధానంగా శ్రీ విష్ణు, మేము ఇరువురం, వెన్నెల కిషోర్ మధ్య వచ్చిన సీన్స్ చాలా ఎంటర్ టైన్ గా ఉన్నాయి. ఇక ఎప్పటిలాగే కీలక పాత్రల్లో కనిపించిన విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య తమ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు. ఈ పాత్రలను కూడా కథలో భాగం చేస్తూ దర్శకుడు బాగా రాసుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు.సింగిల్’ అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్ టైన్ గా సాగింది. ముఖ్యంగా సినిమాలోని ప్రధాన పాత్రలు, ఆ పాత్రల మధ్య డ్రామా, మరియు నటీనటుల నటన.. మొత్తమ్మీద దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమాను ఎంటర్ టైన్ గా నడిపారన్నారు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు కార్తీక్ రాజు బాగా తెరకెక్కించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ప్రవీణ్ ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాతలు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువులు చాలా బాగున్నాయన్నారు. ఏ పత్రిక సమావేశంలో దర్శకుడు కార్తీక్ రాజు, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.