రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి, రాజానగరంలో అటవీ అకాడమీకి శంకుస్థాపన

*సీఎం ఆదేశాలతో త్వరలోనే తూర్పుగోదావరి జిల్లాలో మూడు కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన* *రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి, రాజానగరంలో అటవీ అకాడమీకి శంకుస్థాపన, బొమ్మూరు లో సైన్స్ మ్యూజియం ప్రారంభం**ఆయా కార్యక్రమాల ఏర్పాట్లపై విస్తృత చర్చ.. రాజమండ్రిలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో మంత్రి దుర్గేష్ వెల్లడి* *స్పష్టమైన కార్యాచరణతో ఆయా కార్యక్రమాలు విజయవంతం చేస్తామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్* *త్వరలోనే మూడు కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభం తేదీలు వెల్లడిస్తామని తెలిపిన మంత్రి దుర్గేష్*రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో త్వరలోనే విద్యార్థులకు, పర్యాటకులకు, అటవీ సంరక్షణకు ఉపయోగపడేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరిలు మూడు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు, బహిరంగ సభా వేదిక తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం జూన్ 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం తేదీని మరలా ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరిలు ప్రధానంగా మూడు కార్యక్రమాలను ప్రారంభించనున్నారని తెలిపారు. అందులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం బొమ్మూరు లోని సైన్స్ మ్యూజియం ప్రారంభిస్తారని తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీకి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలన్న అంశంపై తాము చర్చించామన్నా రు. అంతేగాక ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకెళ్లే అంశాన్ని మాట్లాడామన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ఈ సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్, టూరిజం తదితర శాఖల అధికారులతో ప్రత్యేకంగా చర్చించామన్నారు.. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళే విధంగా పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్టు మంత్రి దుర్గేష్ వివరించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link