యోగాతో సంపూర్ణ ఆరోగ్యం – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడియపులంక సత్యదేవ నర్సరీలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర-2025 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి**డ్రగ్స్ నివారణ, సహాయం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఈగల్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి దుర్గేష్**యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సూచన*రాజమహేంద్రవరం: ప్రతి ఒక్కరు యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మానసిక సమస్యలు, అనారోగ్యం దూరమ వుతాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని కడియపులంక లోని సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యదేవ నర్సరీలో నిర్వహించిన యోగాంధ్ర -2025 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ప్రజా ప్రతినిధి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఇతర అధికారులతో కలిసి సూర్యనమస్కారం, ప్రాణాయామం తదితర యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నివారణ, సహాయం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఫోర్స్‌మెంట్)కు సంబంధించి రూపొందించిన పోస్టర్ ను మంత్రి దుర్గేష్ విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు యోగాతో పాటు ధ్యానం, శారీరక వ్యాయామం కూడా చేయాలని తద్వారా మంచి మార్గం వైపు పయనించవచ్చని సూచించారు. యోగాంధ్రతో ఆరోగ్యాంధ్రను తీర్చిదిద్దుతామన్నారు. జూన్‌ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా యోగా ఆవశ్యకతను వివరిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలియజేశారు.యోగా ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాలని,ప్రజలంతా యోగాభ్యాసం చేయాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.

Scroll to Top
Share via
Copy link