విశాఖ బీచ్లో ఏడేళ్ల బాలుడి గల్లంతు!..చెమటోడ్చి ఒడ్డుకు తీసుకొచ్చిన హోంగార్డు పరదేశి!…కేజీహెచ్లో చికిత్స పొందుతూ బాలుడి మృతి!.. విశాఖ బీచ్లో ఆదివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. బీచ్లో వాకింగ్ కోసం తెల్లవారుజామునే దువ్వాడకు చెందిన పి.సంతోష్ తన భార్య, ఇద్దరు కుమారులతో వచ్చారు. కుటుంబ సభ్యులంతా ఒడ్డునే కూర్చోగా ఏడేళ్ల సూర్య మాత్రం అలా అలా సముద్రంలోకి జరిగాడు. దీంతో ఆ బాలుడ్ని అలలు లాక్కెళ్లిపోయాయి. సమాచారం అందుకున్న త్రీటౌన్ ట్రాఫిక్ హోంగార్డు దౌలపల్లి పరదేశి ఆ బాలుడ్ని రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. ఎలాగోలా ఒడ్డుకు తీసుకు వచ్చి బాలుడ్ని 108 వాహనంలో కేజీహెచ్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బీచ్ వద్ద ఈ విషాధ ఘటన చూసిన రాజ్యసభ వైసీపీ సభ్యుడు గొల్ల బాబూరావు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పరదేశి తెగువను కూడా కొనియాడారు. పరదేశి తన ప్రాణాలకు తెగించి మరీ ధైర్య సాహసాలతో సూర్యాను ఒడ్డుకు తీసుకు వచ్చాడని, అయినా బాలుడు దురదృష్టవశాత్తూ మృతి చెందాడని బీచ్ సందర్శకులు తెలిపారు. మెరైన్ పోలీసుల గస్తీ పెంచితే బాలుడు బతికేవాడన్నారు.
