ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అధ్యక్షతన మంగళవారం ఉండ్రాజవరం పీహెచ్సీలో నవంబర్ 12 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు జరుగు న్యుమోనియా కార్యక్రమం పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా ఉండ్రాజవరం వైద్యాధికారి డాక్టర్ ఆర్ఎస్ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ బాల్యం ప్రశాంతంగా ఊపిరి తీసుకోవాలంటే న్యుమోనియా లక్షణాలను వెంటనే గుర్తించడం వలన 0-5 వయస్సు గల పిల్లలను ప్రాణాల నుండి కాపాడవచ్చు అని తెలియజేశారు. న్యుమోనియా ఒక ప్రమాధకరమైన వ్యాధి 5 సం. లోపు పిల్లల మరణాలకు అతి ముఖ్య కారణం అని దాని లక్షణాలు ఈ విధముగా ఉంటాయని తెలియజేశారు. 1.దగ్గు, జలుబు ఎక్కువగా ఉండటం 2.ఎక్కువ సార్లు వేగంగా శ్వాస తీసుకోవడం 3.శ్వాస తీసుకునే సమయంలో డొక్కలు ఎగర వేయడం…4. అధిక జ్వరంతో ఉండటం. అనంతరం మండల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పైన ఉన్న లక్షణాలతో పిల్లలు ఉన్నట్లు అయితే ఇంటి ఉపచారాలతో సమయం వృదా చేయకుండా దగ్గరలో ఉన్న ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లి సరైన సమయంలో సరైన వైద్యం చేయించడం వలన న్యుమోనియా తో ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాగంగా పబ్లిక్ హెల్త్ నర్స్ కే.డి.విఎల్ కుమారి, మహిళా ఆరోగ్య పర్యవేక్షకులు కె. నాగమణి, ఎంఎల్హెచ్పి లు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆషా కార్యకర్తలు పాల్గొన్నారు.
