శుభాకాంక్షలతో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా

నూతన ఆంగ్ల సంవత్సరాన్ని సందర్భంగా బుధవారం ఉండ్రాజవరం మండలంలో ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ లకు వివిధ కార్యాలయాల అధికారులు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల స్థాయి అధికారులు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను నియోజకవర్గ కేంద్రం నిడదవోలులో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందించారు. అదేవిధంగా మండల కేంద్రం ఉండ్రాజవరంలో పంచాయతీ, సచివాలయాల సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం ను ఆయన స్వగృహంలో కలిసి, శుభాకాంక్షలు అందించారు. వేలివెన్నులో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బూరుగుపల్లి శేషారావు సోదరుడు, ఇటీవల నీటి సంఘం ఎన్నికలలో పెరవలి డిసి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బూరుగుపల్లి శ్రీనివాసరావు లను కలిసి తమ అభిమానాన్ని పంచుకున్నారు.

Scroll to Top
Share via
Copy link