తొలి మహిళా ఉపాద్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉభయ గోదావరి జిల్లాల బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాశీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలు భరించి మహిళల విద్యకై పోరాడారని, భారతదేశంలో మహిళా అభ్యున్నతి కొరకు తన జీవితాన్ని ధారబోసిన భారత తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి 194 జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బీసీ నాయకులు జనసైనికులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
