నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ 2024-25 లో భాగంగా విజయవాడ మొగల్రాజపురం లోని పీబీ సిద్ధార్థ జూనియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 68వ స్కూల్ గేమ్స్ లో పాల్గొని క్రీడాకారులకు క్రీడా విశిష్టతను వివరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మంత్రి దుర్గేష్. కవాత్ నిర్వహించిన క్రీడా కారులకు అభివందనం చేసిన మంత్రి దుర్గేష్. కళా వేదికపై అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటారన్న మంత్రి దుర్గేష్. స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 19 ఏళ్ళలోపు బాలికలకు జనవరి 6 నుంచి 10 వరకు టోర్నీల నిర్వహణ.. క్రీడల్లో అద్భుతంగా రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు పాల్గొన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
