జిల్లా వ్యవసాయ అధికారి z.వెంకటేశ్వరరావు మంగళవారం అత్తిలి మండలంలోని గ్రామవ్యవసాయ సహాయకులతో వ్యవసాయాధికారి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా నిర్దేశించిన లక్ష్యాలను సాధించి రైతులకు అన్నిపథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, రబీ నాట్లు మొదలయినందుకు రబీ ఈ పంట నమోదు చేయాలని జిల్లా ఆదేశించారు.
ఆ తరువాత పాలి గ్రామంలోని ఈ పంట App పై VAA/VHA రైతులతో పరిశీలించడం జరిగింది.
అలాగే రైతులకు నాట్లు వేసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.
- కాండం తొలిచే పురుగు గ్రుడ్లను ఆకు చివర పెడుతుంది కావున నారు నాటేటప్పుడు కొసలు విరిచి నాటాలి. దీనితో గ్రుడ్లను నిర్మూలించి పురుగు ఉదృతి తగ్గించవచ్చు.
- మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి కావున కాంప్లెక్స్ ఎరువును పైపాతుగా వేయరాదు.
3.నారు తీసేటపుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటెనే మూన త్వరగా తిరుగుతుంది.
4.నాలుగు నుండిఆరుఆకులున్ను నారును ఉపమోగించాలి. ముదురు నారును నాటితే దిగుబడి తగ్గుతుంది.
5.నాటు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీప్ లో చ //మీ //కు ౩౩ మూనలు ఉండెతట్లు చూడాలి.
6.నాటిన తర్వాత ప్రతి రెండుమీటర్లకు 20సెం.మీ .బాటలు తీయటం వలన ఫైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడిపిడాల ఉదృతి కొంతవరకు అదుపుచేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వెయటానికి ఇంకా పైరు పరిస్ధితిని గమనించటానికి ఈ బాటలు బాగా ఉపమోగపడతాయి.