తణుకులో పద్మశాలి ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభా కార్యక్రమంలో వావిలాల సరళాదేవి ముఖ్యఅతిథిగా పాల్గొని
పద్మశాలిల ఎంప్లాయిస్ ఫెడరేషన్ డైరీ, కెలండర్ ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా ఎంప్లాయిస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర బి.సి.మహిళా నేత, వీవర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సరళాదేవి మాట్లాడుతూ పద్మశాలిలో ఐక్యత, కులచరిత్ర గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాఅధ్యక్షుడు కట్టా లక్మణస్వామి, కార్యదర్శి కుమారస్వామి, కోపరేటీవ్ , డిప్యూటి తహశీల్దార్ బి.శ్రీదేవి చింతలపూడి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
