కేంద్ర బడ్జెట్-2025 ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్నారు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజానుకూల, ప్రగతిశీల బడ్జెట్ను కేంద్రమంత్రి ప్రవేశపెట్టారు – మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు కీలక పరిణామం – ఈ బడ్జెట్ ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతకు ప్రతిబింబం – బడ్జెట్లో మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత – ఐదేళ్లలో వృద్ధికి తోడ్పడే 6 కీలక రంగాలను ఈ బడ్జెట్ గుర్తించిందని – ఈ బడ్జెట్ జాతి శ్రేయస్సు దిశగా పడే కీలక అడుగులకు సూచిక – సుసంపన్న భారత్కు వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్గా పనిచేస్తుందన్నారు. మరోవైపు 2025-26 ఆర్థిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత లభించిందని పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, విశాఖ స్టీల్కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు సహా అనేక కేటాయింపులు చేయడం శుభపరిణామం అన్నారు.
