దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ యువత,మహిళ,రైతు, పేదలే లక్ష్యంగా 2025 బడ్జెట్ ఐనంపూడి శ్రీదేవి ( భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు ) దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని, యువత, మహిళ, రైతు, పేదలే లక్ష్యంగా 2025 బడ్జెట్ ప్రవేశ పెట్టారని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని, సున్నా శాతం పేదరికమే లక్ష్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారన్నారు.
