విశాఖలోని 34వ వార్డు అంబేద్కర్ కాలనీకి చెంది జి.నూకరాజు కిడ్నీ, లివర్ సమస్యలతో భాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ సంఘ సేవకులు, ఉపకార్ ట్రస్టు చైర్మన్, ఏపీజేయూ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు దృష్టికి జర్నలిస్టులు తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి తక్షణ సహాయం క్రిందర రూ.5వేలు బాధితుడికి అందజేశారు. తీవ్ర అనారోగ్యంతో కెజిహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు కూడా చెప్పలేమని చేతులెత్తేశారు. అతనికి తల్లిదండ్రులు కూడా లేరు. కెజిహెచ్ లో కాకుండా మరికొన్ని టెస్ట్ లకు , మందులకు ఇబ్బందులు పడుతుంటంతో విశాఖలో నిరుపేదలకు నిశ్వార్ధంగా సేవలందించే డా.కంచర్ల అచ్యుతరావు నేనున్నాననే అభయం ఇచ్చారు. రానున్న రోజుల్లో కూడా తనవంతు సహాయం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా డా.కంచర్ల మాట్లాడుతూ, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు, వారికి తెలిసిన నిరుపేదలకు సహాయం చేయడానికి తాను ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. మీడియా అనేది సమాజంలో నాల్గవ మూల స్థంబమని వారికి సహాయం చేస్తే సమాజానికి సహాయం చేసినట్టుగానే తాను భావిస్తానని చెప్పారు. డా. కంచర్ల అందించిన సహాయంతో ప్రస్తుతం రోగికి మందులు తీసుకున్నా కేర్ టేకర్లు. అంతేకాకుండా అడిగిన వెంటనే సహాయం చేసిన డా.కంచర్లకు ధన్యవాదములు తెలియజేశారు.
