ఉండ్రాజవరం శాఖ గ్రంధాలయంలో గురువారం శ్రీ మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో వాల్మీకి చిత్రపటానికి పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావులు మాట్లాడుతూ వాల్మీకి సాంస్కృతిక సాహిత్యంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి అని వాల్మీకి రామాయణం వ్రాసి, సంస్కృతిక భాష ఆదికవిగా గుర్తిస్తారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి గుత్తికొండ కృష్ణారావు పాఠకులు ఏం.వి. కృష్ణారావు, వంగా చందర్రావు, పి.శ్రీను, టీ.వరప్రసాద్, కాయల వీర వెంకట సత్యనారాయణ, కె. శీను తదితరులు పాల్గొన్నారు.
