తణుకు 29 వ వార్డులో గ్రామదర్శిని

తణుకు పట్టణంలోని 29వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం లో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

            *********

తణుకు పట్టణంలోని 29వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రైవేట్ స్థలాలలో మొక్కలు ఎక్కువగా పెరిగిపోయి ఉన్నాయని మొక్కలన్ని తొలగించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా 29 వ వార్డులో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అన్నారు.ముఖ్యంగా రెవెన్యూ అధికారులు, హెల్త్ సెక్రెటరీ, వార్డు అడ్మిన్లు, ఈ ప్రోగ్రాంలో పాల్గొని, వార్డుల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తణుకు నియోజకవర్గంలోని గ్రామాలలో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి సత్వర పరిష్కారాలు చేసేందుకు ముందుకు వస్తున్నాం అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అధికారులతో వాటి పరిష్కారాలు చూపే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్లు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link