భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ కొప్పిశెట్టి మంగతాయారు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇరగవరం మండల పరిషత్ అధ్యక్షులు మంగతాయారు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ విధానాల వల్లనే ఈరోజు భారత పౌరులు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన లో స్వేచ్ఛ వాయువులు పొందుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏ శ్రీనివాస్, మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
