చైత్ర బహుళ చతుర్దశి సందర్భంగా ఉండ్రాజవరం గ్రామంలో స్వయంభుగా వెలసియున్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత గోకర్ణేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం సాయంత్రం ప్రదోషకాలంలో శ్రీ మహా నందీశ్వరస్వామికి లఘున్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ ప్రతీ అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజున నందీశ్వరునికి అభిషేకం, ప్రత్యేక పూజలు వలన గ్రహదోషాలు తొలగి ఆరోగ్యం చేకూరి మనశ్శాంతి లభిస్తుందని అర్చకులు మద్దిరాల వెంకటరమణ తెలిపారు. అర్చన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు.
