పల్లె- పండగ అనే కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఒకపక్క సంక్షేమం మరొకపక్క అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనలతో 22 లక్షల వ్యయంతో డ్రైనేజీ శంకుస్థాపన,2.30 లక్షల వ్యయంతో మినీ గోకులం శంకుస్థాపన చేయడం జరిగింది అని, అలాగే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మాజీ జడ్పిటిసి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు అన్నారు. గతప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, అందుకే ప్రజలు చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మానే భాస్కరరావు, పసుపులేటి అబ్బులు, గ్రామసర్పంచ్ స్వరాజ్యం, పార్టీ సెక్రటరీలు కామన రాంబాబు, మంగిన శ్రీను, గూడూరి నాగరాజు కామన ఏడుకొండలు, చీలి అశోక్ శివ మరియు కూటమి నాయకులు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.
