అమరవీరుల త్యాగాలను మరువలేము- ఎస్.ఐ. జి.శ్రీనివాసరావు

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21వ తేది సోమవారం ఉండ్రాజవరం ఎస్ఐ జి.శ్రీనివాసరావు, స్టేషన్ సిబ్బంది, మండలంలోని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఎం.వి.ఎన్.జడ్.పి.హైస్కూల్ ప్రధానోపాద్యాయులు మాణిక్యాలరావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ అమరవీరుల సంస్మరణగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను మరువరాదని, వారి స్ఫూర్తితో కర్తవ్యం నిర్వహణలో పాల్గొనాలని ఎస్సై జి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా బాల బాలికలతో ఉండ్రాజవరం సెంటర్ నుండి హైస్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు.

Scroll to Top
Share via
Copy link