అమరవీరుల త్యాగాలే – నేటి తరాలకు ఆదర్శాలు – ఏస్సై జానా సతీష్

కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21వ తేది సోమవారం ఇరగవరం ఎస్ఐ జానా సతీష్, స్టేషన్ సిబ్బంది, మండలంలోని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ అమరవీరుల సంస్మరణగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను మరువరాదని, వారి స్ఫూర్తితో కర్తవ్యం నిర్వహణలో పాల్గొనాలని, వారు చేసిన త్యాగాల ఫలితమే నేటి మన ప్రశాంత జీవనం అని ఎస్సై జానా సతీష్ అన్నారు. ఈ సందర్భంగా బాల బాలికలతో పోలీస్ స్టేషన్ వద్ద నుండి ఇరగవరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

Scroll to Top
Share via
Copy link