విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరుల సంస్మరణార్థం నిర్వహించుకుని, భావితరాలకు వారి త్యాగాలను తెలియజెప్పడమే అమరవీరుల సంస్మరణ దిన ఉద్దేశమని పోలీసు అధికారుల తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం అక్టోబర్ 21వ తేదీ సోమవారం తణుకు పట్టణ, రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగ ఫలాలను వివరిస్తూ పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నరేంద్ర సెంటర్ యందు అమరవీరుల స్థూపము వద్ద పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలు విద్యాసంస్థల బాలబాలికలు, టౌన్ రూరల్ సిఐలు, ఎస్సై లు, ట్రాఫిక్ ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.
