తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో స్థానిక 22వ వార్డులో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు, సమస్యల నుండి విముక్తి చేసేందుకు గ్రామదర్శిని కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గడిచిన గత ఐదు సంవత్సరాలు కాలంలో తణుకు మున్సిపాలిటీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అన్నారు. 22 వార్డు పర్యటనలో పాల్గొని స్థానికులు సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి వార్డుల్లోనూ డ్రైనేజీల్లో సిల్ట్ తీయలేదని, డ్రైనేజీలు పూర్తిగా పాడైపోయి ఉన్నాయని అన్నారు. డ్రైనేజీలు పూడిక తీయకపోవడంతో ఇక్కడ కొద్దిపాటి వర్షం వచ్చిన రోడ్లన్నీ మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇటువంటి సమస్యలతో ఉన్న ఈ వార్డు నల్లజర్ల వీధి కి సంబంధించి 23 లక్షల రూపాయల సిసి రోడ్డు నిర్మాణం చేపట్టడానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వార్డులో ప్రజలందరూ కూడా సహకరించాలని ఖాళీ స్థలంలో ఉన్న యజమానులు మొక్కలను చెత్తను పూర్తిగా తొలగించి బాధ్యత యజమానులు చూసుకోవాలని అన్నారు. తణుకు పట్టణంలో అన్ని , వార్డుల్లో అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు.15వ ఆర్థిక నిధులు భాగంగా కోటి రూపాయలు నిధులతో పలువార్డుల్లో డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదన పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
