తణుకు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, శానిటరీ, సచివాలయం సెక్రటరీలతో బుధవారం ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పట్టణంలో పారిశుధ్య పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాలకు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలు డెంగ్యూ, మలేరియా లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవలసిన ప్రత్యేక జాగ్రత్తలు గురించి వివరించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి ఎంఎల్ఏ ఆరిమిల్లి రాధాకృష్ణ దుస్తులు అందజేశారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ టి.రాం కుమార్, మున్సిపల్ అధికారులు, తెలుగుదేశంనాయకులు పరిమి వెంకన్నబాబు, బసవ రామకృష్ణ, మంత్రిరావు వెంకటరత్నం, తాతపూడి మారుతీరావు, తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
