తణుకు నియోజకవర్గంలో శాసనసభ్యుల కార్యాలయం నందు బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించినారు, ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని అన్నారు. దేశ విదేశాల నుండి పెట్టుబడులు ఈరోజు రాష్ట్రంలో క్యూ కడుతున్నాయి. మరో ప్రక్క సంక్షేమ పథకాలు హామీలు కూడా ఎన్నికలలో ఇచ్చిన హామీలు మేరకు ఒక ప్రణాళిక ద్వారా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం జగన్ పరిపాలన ఐదు సంవత్సరాలు గాలికి వదిలేసి తాడేపల్లి ప్యాలెస్ పరిమితమై ఆరోజు నేను ఉన్నాను నేను చూస్తాను అన్న జగన్ మోహన్ రెడ్డి నేను వినను నేను చూడను అని తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమై ఈ రాష్ట్రాన్ని అధోగతం పాలన చేసి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో ఈరోజు జాతీయరికార్డు ప్రకారం 2 లక్షల మంది మహిళలపై దాడులు హత్యాచారాలు ఈ రాష్ట్రంలో జరగడం వాస్తవం కాదా అని అన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు దాడులు జరగడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చి గంజాయి విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తూ మహిళలపై అత్యాచారాలకు కారణమైనది వైయస్సార్సీపి ప్రభుత్వం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు, పాపములు వలన ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని కూడా వెంటాడుచున్నవి అని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకత్వంలో గంజాయి వ్యాపారం చేస్తూ గల్లి నుండి రాజధాని వరకు విచ్చలవిడిగా వైసీపీ వాళ్లు వ్యాపారాలు చేశారు అన్నారు. రాష్ట్రంలో జరుగుచున్న ఘటన ధాడులకు కారణం కేవలం గంజాయి వలననే జరుగుతున్నాయని దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. యువతను ప్రక్కదోవ పట్టించి యువతను సర్వనాశనం అవ్వడానికి గల కారణం జగన్ బాధ్యత వహించాలని అన్నారు.తాడేపల్లి కను సన్నలలో అత్యాచాలు జరిగినవి పులివెందులలో అత్యాచారాలు జరిగినవి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా ఏనాడు కూడా తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అని అన్నారు. హత్యలు జరిగిన హత్యాచారాలు జరిగిన వాళ్ళ దగ్గరకు ఏ రోజు పరామర్శించడానికి వెళ్లలేదు ఒక నియంత పరిపాలన ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేశారు, అందుకనే రాష్ట్ర ప్రజలు తరిమితరిమి కొట్టి బుద్ధి చెప్పినారు అన్నారు.గడచిన ఐదేళ్ల పరిపాలన కాలంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు.
రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధిలో వెనకడుగు ప్రజాజీవన పరిమాణాలలో వెనకడుగు అన్ని విధాలుగా కుదేలైన రాష్ట్రాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు అన్నారు.గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన గంజాయి డ్రగ్స్ నాసిరకం మద్యం వలన ఈరోజు మహిళలపై ప్రజలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.తల్లికి చెల్లికి న్యాయం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏ న్యాయం చేస్తారు అని అన్నారు.గత ఐదు సంవత్సరములో జగన్ రెడ్డి పరిపాలనను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపై విమర్శలు చేస్తున్నారు అని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి ఇప్పుడు ప్రెస్ మీట్ లు పెడుతున్నారు అంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు తెలుస్తుంది అన్నారు.జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎప్పుడు రానటువంటి పెట్టుబడులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో వస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క పరిపాలనని అన్నారు.జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమై అప్పుడప్పుడు బయటకు వచ్చి ఈ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆరోజు సరియైన పరిపాలన చేయలేదు, ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేదని అన్నారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని అన్నారు, కూటమి ప్రభుత్వం జరిగిన 120 రోజులు పరిపాలనలో ఎక్కడైనా మహిళలపై దాడులు జరిగిన వెంటనే స్పందించి వారిని న్యాయం చేసి ముద్దాయిలను అరెస్టు చేయించడం జరుగుతుందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో ఐదు సంవత్సరములు పరిపాలనలో మంత్రిగా దోచుకో దాచుకో అని రాష్ట్రాన్ని దోచుకున్న మాజీమంత్రి అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ లు పెడుతున్నాడని, అప్పుడు మంత్రిగా ఉండి నియోజకవర్గమునకు ఏమీ అభివృద్ధి చేశారని అన్నారు, ప్రజల నుండి అన్ని విధాల దోచుకున్నావు తప్ప నీవు చేసింది ఏమీ లేదని అన్నారు. మాజీమంత్రి ప్రెస్ మీట్ లో అన్నా క్యాంటీన్ గురించి, వరదలు గురించి చందాలు అడుకున్నారని అంటున్నారని అన్నారు, కానీ ఈరోజు ఏ పిలుపు లేకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు సీఎం రిలీఫ్ ఫండ్ కు సుమారు 450 కోట్లు ఇచ్చారని కేవలం చంద్రబాబునాయుడు పరిపాలనలో ఇలా జరిగిందని అందుచేత వరద బాధితులకు ఆదుకోవడం జరిగిందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రిగా నీకు వచ్చిన ఓట్లు 25% మాత్రమే ఎన్నడూ లేని విధంగా కూటమి పార్టీకి అత్యధికంగా ఓట్లు కూటము పార్టీకి వేసి నీకు గుణపాఠం చెప్పారు అన్నారు. తణుకు నియోజకవర్గంలో పారిశుధ్యం గురించి మాట్లాడే హక్కు మాజీ మంత్రిగా నీకు లేదని, ఐదు సంవత్సరాలలో ఏ రోజు కూడా డ్రైనేజీలలో సిల్ట్ కూడా తీయలేదు, పారిశుధ్యం గురించి నీకు మాట్లాడే హక్కు లేదని అన్నారు. కూటమిప్రభుత్వంలో తణుకు నియోజకవర్గం తిరిగి పనులు గురించి తెలుసుకొని పనులు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు.
మాజీ మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకున్నందుకే నీకు నియోజకవర్గ ప్రజలు నీకు భవిష్యత్తు లేకుండా తీర్పు ఇచ్చి ఇంటికి పంపించినారని అన్నారు. కారుమూరి నాగేశ్వరరావు మీరు నోటిని ఫినాయిల్ తో కడుక్కోండి పాపాలు పోతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు దొమ్మేటి వెంకట సుధాకర్,బసవా రామకృష్ణ, మంత్రిరావు వెంకటరత్నం, వావిలాల సరళాదేవి, తాతపూడి మారుతీరావు, ఒమ్మి రాంబాబు, బిజేపి నాయకులు అయినంపూడి శ్రీదేవి, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బిజెపి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
